“అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్” లో 8 దేశాల అగ్రశ్రేణి ప్రొఫెషనల్ ఫైటర్లు ”

“తెలంగాణలో ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్”

హైదరాబాద్‌లోని జూబ్లీ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్ 2025 ను అధికారికంగా ప్రకటిస్తూ పత్రికా సమావేశం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ మొదటిసారిగా జరగనున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ మరియు బాక్సింగ్ పోటీలు ఆగస్టు 22 మరియు 23 తేదీల్లో గచ్చిబౌలి GMCB ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి.

ఈ కార్యక్రమాన్ని Priya Eventz మరియు Vibe Media సంయుక్తంగా నిర్వహించగా, International Combat Federation (ICF) భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇందులో Indian Boxing Council, World Boxing Council, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నాయి.

మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా Vibe Group ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శ్రీధర్ యలాల గారు, ఈ ఛాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌ను అంతర్జాతీయ క్రీడా నగరంగా పరిచయం చేసే ఒక కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ పోటీ కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాకుండా, తెలంగాణను ప్రపంచ క్రీడా పటంలో నిలిపే వ్యూహాత్మక ఉద్యమంగా వివరించారు.

2037 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించాలన్న లక్ష్యంను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈవెంట్ ద్వారా హైదరాబాద్‌కి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిర్వహణ సామర్థ్యం, మరియు ప్రజా భాగస్వామ్యంలను ప్రపంచానికి చూపించగలమని తెలిపారు.

“ఈ ఛాంపియన్‌షిప్ కేవలం ఒక అంతర్జాతీయ పోటీ మాత్రమే కాదు… ఇది ఒక ప్రకటన – హైదరాబాద్ గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్స్‌కి సిద్ధంగా ఉందన్నదానికి మద్దతుగా నిలుస్తుంది,” అని పేర్కొన్నారు.

అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి మరియు భాగస్వామ్య సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేసి, ఈ కార్యక్రమం తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుందని తెలిపారు.

International Combat Federation (ICF) చైర్మన్ శ్రీ ముస్తాక్ అలీ గారు, ఈ ఛాంపియన్‌షిప్ భారత దేశంలోని కాంబాట్ స్పోర్ట్స్ అభివృద్ధికి మార్గం చూపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పోటీ ద్వారా భారత ఫైటర్లకు అంతర్జాతీయ వేదికపై పోటీ చేసే అరుదైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

“మన దేశంలోని ఫైటర్లకు టాలెంట్, శ్రమ, పట్టుదల ఉన్నా, ప్రపంచ స్థాయి అనుభవం, మద్దతు వ్యవస్థ కొరతగా ఉంది. ఈ పోటీ వాటిని అధిగమించే అవకాశం,” అని అన్నారు.

10 దేశాల నుంచి వచ్చే టాప్ లెవెల్ ఇంటర్నేషనల్ ఫైటర్లతో కలిసి భారతీయ ఫైటర్లు రింగ్ పంచుకోవడం ద్వారా, వారి నైపుణ్యం మెరుగవుతుంది, విశ్వాసం పెరుగుతుంది, మరియు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే మార్గాలు తెరచుకుంటాయి అని వివరించారు.

ఈ పోటీలు గెలుపు, బంగారు పతకాలకు మించి, అనుభవం, ప్రొఫెషనల్ గైడెన్స్, మరియు గ్లోబల్ ఎక్స్‌పోజర్ కల్పించడమే లక్ష్యంగా ఉంటుందని చెప్పారు.

అంతే కాకుండా Priya Eventz, Vibe Media, మరియు మద్దతు ఇచ్చిన IBF, WBC, మరియు తెలంగాణ ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. “ఈ ఛాంపియన్‌షిప్ ద్వారా combat sports రంగంలో భారత్ గ్లోబల్ స్టేజీపై నిలబడే దిశగా ఒక బలమైన అడుగు వేస్తోంది,” అని వ్యాఖ్యానించారు.

శ్రీ శ్యామ్ పృథ్విరాజ్, ఈవెంట్ ఆర్గనైజింగ్ కమిటీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ, తెలంగాణలోని యువ ఫైటర్లకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పారు. “ఈవెంట్ ద్వారా స్థానిక ప్రతిభ అంతర్జాతీయ స్థాయికి వెళ్లే మార్గాన్ని ఏర్పరిచేలా చేస్తుంది,” అని తెలిపారు.

శ్రీ అశోక్ మచ్చ, ఈవెంట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ, combat sports ఇప్పుడు భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఈ పోటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నిర్వహణ, మరియు అంతర్జాతీయ భాగస్వామ్యం విషయంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని చెప్పారు.

ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ప్రముఖులు:

మిసెస్ ప్రియ, CEO & Founder – Priya Eventz

మనికంథ్ కొండపల్లి, తెలంగాణ కాంగ్రెస్ యువ నాయకుడు

రామకృష్ణ చక్రవర్తి, Maa Eventz

ఆనంద్ అలజంగి, డైరెక్టర్

స్టీఫెన్ ఆంథనీ, మీడియా కన్సల్టెంట్

రాజా రెడ్డి, డెక్కన్ విజన్

పీ. గోపి కుమార్, PRO

ICF అధికారులు, కోచ్‌లు మరియు మీడియా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

ఈ ఛాంపియన్‌షిప్‌లో 10 దేశాల నుంచి 40 మంది ప్రొఫెషనల్ ఫైటర్లు పాల్గొనబోతున్నారు – ఇది దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత భారీ combat sports ఈవెంట్ అవుతుంది.

ఈ పోటీలు కేవలం రింగ్‌లో జరిగే పోరాటాలు మాత్రమే కాదు – స్థానిక ఫైటర్ల శక్తిని ప్రపంచానికి పరిచయం చేయడం, హైదరాబాద్‌ను గ్లోబల్ స్పోర్ట్స్ మ్యాప్‌పై నిలబెట్టడం, మరియు భారత క్రీడల భవిష్యత్తుని తీర్చిదిద్దడం లక్ష్యం.

టికెట్లు BookMyShow, District మరియు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

మీడియా మిత్రులు మరియు భాగస్వాముల మద్దతుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ గ్రాండ్ ఈవెంట్‌ను చూడటానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము.